హైదరాబాద్ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మౌత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. స్వస్తివాచనంతో ప్రారంభమైన వార్షిక బ్రహ్మౌత్సవాలు.. మంగళవారం ధ్వజారోహణం, గరుడ అళ్వారుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమం ఫిబ్రవరి 25వ తేదీ వరకు కొనసాగనుంది. అలాగే బ్రహ్మౌత్సవాలు ఫిబ్రవరి 21 తేదీన ఎదుర్కోలు, 22వ తేదీన తిరుకల్యాణం, 23 తేదీన దివ్య విమాన రథోత్సవం జరగనున్నాయి. ఫిబ్రవరి 25 తేదీన అష్టోత్తర శత ఘటాభిషేకంతో ముగియనున్నాయి.