మహి వి రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆటమ్ లీవ్స్ వీ సెల్యులాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం యాత్ర 2. టీజర్ను శుక్రవారం చిత్ర నిర్మాతలు హైదరాబాద్లో విడుదల చేశారు. ఫిబ్రవరి 8న ఈ సినిమా విడుదల కానుంది. వైఎస్ రాజశేఖర్రెడ్డి పాత్రలో మమ్ముట్టి, కొడుకు వైఎస్ జగన్మోహనరెడ్డి జగన్ పాత్రలో జీవా నటించారు. జగన్ రాజకీయాల్లో రావటానికి కారణాలను చూపుతూ ఓ సన్నివేశాన్ని చూపించారు. అడ్డంకులు రావటం, సిఎం ఎదగటం వంటి రాజకీయ ఘటనలను ఈ చిత్రంలో తెరకెక్కించినట్లుగా చిత్ర నిర్మాతలు తెలిపారు. డైరెక్టర్గా మహి వ్యవహరిస్తున్నారు. సంగీతం సంతోష్ నారాయణ సంగీతాన్ని అందించారు. ఇందులో నారా చంద్రబాబునాయుడు పాత్రలో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్, సోనియాగాంధీ పాత్రలో సుజాన్ బెర్నెర్ట్, వైఎస్ భారతి పాత్రలో కేతకి నారాయణన్ నటించారు. 2019, ఫిబ్రవరి 8న యాత్ర 1 విడుదలైనందున అదేరోజున తిరిగి యాత్ర 2 విడుదల చేయనున్నామని నిర్మాతలు తెలిపారు.