ప్రజాశక్తి-యర్రగొండపాలెం యర్రగొండపాలెంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో గురువారం కామర్స్ విభాగం అధ్యాపకులు డాక్టర్ రహమతున్నీసాబేగం, డాక్టర్ విజయ నాయక్ల ఆధ్వర్యంలో బికాం విద్యార్థులు ట్రేడ్ ఫేర్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు తాము తయారు చేసిన వివిధ రకాల వంటకాలు, తినుబండారాలు, పండ్లు, స్టేషనరీ, డ్రస్ మెటీరియల్స్ ప్రదర్శించడంతో పాటు వినియోగదారులకు విక్రయించారు. ఇది విద్యార్థులలో పోటీతత్వాన్ని, వారి వ్యాపార, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఎంతగానో దోహదపడుతుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి శ్రీధర్ నాయుడు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి ప్రదీప్ తెలిపారు. ట్రేడ్ ఫేర్ నిర్వహించిన విద్యార్థులను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ పుష్పరాజు, డాక్టర్ సుజాత, శ్రీనివాస్, ఝూన్సీ, వెంకటేశ్వరరెడ్డి, రాజా నాయక్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు, ఇతర అధ్యాకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.