మొక్కజొన్న కొనుగోలు మరిచిన ప్రభుత్వం

Mar 27,2024 21:33

ప్రజాశక్తి-సాలూరు రూరల్‌ : సాలూరు నియోజకవర్గంలో రైతులు విస్తారంగా సాగుచేసే పంట మొక్కజొన్నని, అలా పంట కొనుగోళ్లను ప్రభుత్వం విస్మరించిందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు జి.సంధ్యారాణి విమర్శించారు. మండలంలో పట్టుచెన్నూరు పంచాయతీ పరిధిలో వెలగవలస, శిఖపరువు, నిమ్మలపాడు, గుజ్జంగివలస, కొత్తూరు గ్రామాల్లో బుధవారం ఆమె ప్రచారం చేశారు. గత ఐదేళ్లలో రైతులు పండించే పంటల కొనుగోలుకు ఒక విధానం ఉందని కూడా మరిచిపోయారని ఆరోపించారు. సంక్షేమం, అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదన్నారు. ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే రాష్ట్రాన్ని మర్చిపోవల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి టిడిపి మినీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు ఎ.పరమేశ్‌, బి.తవుడు, కోట లక్ష్మణ, దొర లక్ష్మణ, తదితరులు పాల్గొన్నారు

➡️