ఆర్థిక సాయం అందజేస్తున్న శ్రీనివాసులు ఆచారి
ప్రజాశక్తి-ఆదోనిరూరల్
పట్టణంలోని 19వ వార్డు ఆర్టిసి కాలనీలో నివసిస్తున్న ముస్లిం, మైనారిటీకి చెందిన రసూల్ బాష అనారోగ్యంతో మృతి చెందారు. అలాగే దివాకర్ నగర్కు చెందిన అమీర్ బాష పెరాలసిస్తో ఇబ్బంది పడుతూ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న టిడిపి 19వ వార్డు ఇన్ఛార్జీ శ్రీనివాసులు ఆచారి టిడిపి ఇన్ఛార్జీ, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు శుక్రవారం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేశారు. టిడిపి నాయకులు డిష్ ఈరన్న, ధర్మరవి, నరేంద్ర, రామదాస్, సురేంద్ర, వెంకటేష్, మల్లేష్ పాల్గొన్నారు.