ముమ్మరంగా పారిశుధ్య పనులు

Dec 2,2023 20:52
పారిశుద్య పనులకు సిద్ధంగా ఉన్న ట్రాక్టరు

పారిశుద్య పనులకు సిద్ధంగా ఉన్న ట్రాక్టరు
ముమ్మరంగా పారిశుధ్య పనులు
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు:కురుస్తోన్న భారీ వర్షాలు, తుపానుల కారణంగా దోమలు, అంటు వ్యాధులు, సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా మండలంలోని పలు పంచాయతీల్లో శనివారం ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టడం జరిగింది. ఇఒపిఆర్‌డి నారాయణ రెడ్డి పర్యవేక్షణలో ఈ పనులు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా నరుకూరు పంచాయతీలో రోడ్ల మార్జిన్‌ లోని చెత్తచెదారాలను జేసీబీ యంత్రం, ట్రాక్టర్ల ద్వారా తొలగించారు. ఈ సందర్బంగా నారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ హరినారాయణన్‌, జిల్లా పంచాయతీ అధికారులు ఆదేశాలు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల్లో భాగంగా తాగునీటి వనరులు కాలుష్యం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. స్వచ్ఛమైన తాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇకపోతే చూడడం, దోమల నివారణ చర్యలు, అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమాల పర్యవే క్షణ కోసం మండల స్థాయిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తె లిపారు. ఈ సెల్‌ ద్వారా పంచాయతీల కార్యదర్శులు, సర్పంచ్‌లు, వైద్య ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది, ఇతర అధికారులు సమన్వయం చేసుకొంటూ ప్రత్యేక పారి శుధ్య పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రత్యేక పారిశుధ్య పనులు నిర్లక్ష్యం చేస్తే సంబంధితులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

➡️