ముదినేపల్లి తహశీల్దార్‌గా కుమారి

ముదినేపల్లి: మండల తహశీల్దార్‌గా ఎస్‌ఎల్‌ఎన్‌.కుమారి మంగళవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట తహశీల్దార్‌గా పనిచేస్తున్న కుమారి ఎన్నికల నేపథ్యంలో జరిగిన బదిలీల్లో భాగంగా ముదినేపల్లి వచ్చారు. ఇక్కడ తహశీల్దార్‌ పనిచేస్తున్న కె.శ్రీనివాస్‌ పశ్చిమగోదావరి జిల్లా ఉండి తహశీల్దార్‌గా బదిలీపై వెళ్లారు. తహశీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన కుమారిని రెవెన్యూ అధికారులు, విఆర్‌ఒలు అభినందించారు. అనంతరం ఆమె ఎంపిపి రామిశెట్టి సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపిపి సత్యనారాయణ మాట్లాడుతూ మండలాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని తహశీల్దార్‌కు సూచించారు.

➡️