ముగింపు సభ జయప్రదం చేయండి

Dec 17,2023 21:56 #TDP
ఫొటో : మాట్లాడుతున్న టిడిపి ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు

ఫొటో : మాట్లాడుతున్న టిడిపి ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు
ముగింపు సభ జయప్రదం చేయండి
ప్రజాశక్తి-కావలి : 20వ తేదీన విజయనగరం జిల్లా, నెల్లిమర్ల నియోజకవర్గం, భోగాపురం మండలం, పొలిపల్లి గ్రామం, భూమాతా లేవుట్‌లో జరిగే యువగళం పాదయాత్ర ముగింపు సభ కార్యక్రమానికి కావలి నియోజకవర్గం నుండి అత్యధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొనాలని నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం కావలి నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో టిడిపి శ్రేణులతో సమావేశం నిర్వహించారు. పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ముగింపు సభకు కావలి నియోజకవర్గం నుండి తరలి వెళ్లేందుకు అత్యధిక సంఖ్యలో వాహనాలను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. 500మందికి తగ్గకుండా తరలి వెళ్లాలని ప్రణాళికలు రూపొందించారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రిగా నారా చంద్ర బాబునాయుడు రావాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అదిఒక్క చంద్రబాబునాయుడుతోనే సాధ్యమని, యువతకు నారా లోకేష్‌ సారథ్యంలో ఎంతోమేలు కలుగుతుందని తెలియజేశారు.

➡️