ప్రజాశక్తి – నెల్లిమర్ల : అనంతపురం జిల్లా రాప్తాడులో ఆదివారం సీఎం జగన్మోహన్ రెడ్డి ‘సిద్ధం’ సభకు విధి నిర్వహణలో భాగంగా ఫోటోలు తీసేందుకు వెళ్లిన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై కొంతమంది దారుణంగా దాడి చేసిన సంఘటన నెల్లిమర్ల ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండిస్తూ ప్రెస్ క్లబ్ సభ్యులు సోమవారం డిప్యూటీ తహశీల్దార్ డి శైలజను కలిసి వినతి పత్రం అందజేశారు. నిందితులపై తక్షణమే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ తరహా దాడులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాళ్ల శ్రీనివాసరావుతో పాటు విలేకర్లు ఆరిపాక రాము, రమణ, శ్రీను, సీతారాం, శనపతి శ్రీను తదితరులు పాల్గొన్నారు.