పోటీలను ప్రారంభిస్తున్న ఎపిఎన్జిఒ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు
ప్రజాశక్తి-గుంటూరు : అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఎపిఎన్జిఒ అసోసియేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఎన్జిఒ హోంలో మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు ఘంటసాల శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. మొదటి రోజు టగ్ ఆఫ్ వార్, లెమన్ అండ్ స్పూన్, గోలి ఇన్ బాటిల్ మ్యూజికల్ చైర్స్ పోటీలు నిర్వహించారు. నేడు సాంస్కతిక విభాగంలో నత్య విభాగం, ఫాన్సీ డ్రెస్ కాంపిటేషన్, వన్ మినిట్ తెలుగు, పాటల పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి ఎ.శ్యాంసుందర్, జిల్లా మహిళా సంయుక్త కార్యదర్శి కె.శివజ్యోతి, నగర అధ్యక్షులు ఎస్.పి.ఎస్.సూరి, కార్యదర్శి చింతల కళ్యాణ్కుమార్అనిల్, ఎం శ్రీనివాసరావు, మహిళా విభాగం జిల్లా చైర్పర్సన్ రాధా రాణి, కన్వీనర్ కె.లక్ష్మీరమ్య పాల్గొన్నారు.