మంత్రి అంబటిని ఓడిస్తాం

Jan 15,2024 18:11 #ambati rambabu
  •  అసమ్మతి నేతలు సమావేశం

ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్‌( పల్నాడు) : సత్తెనపల్లి నియోజకవర్గ అసమ్మతి వైసీపీ నేతలు మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ‘అంబటి రాంబాబు వద్దు… జగనన్నే ముద్దు’ అంటూ రాజుపాలెం మండలం కోట నెమలిపురి గ్రామంలో సోమవారం వారం సమావేశం నిర్వహించారు.మంత్రి అంబటి ప్రతి గ్రామంలో వైసీపీలోనే రెండు ముఠాలు ఏర్పాటు చేసి కక్షలకు కారణమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబుకు ఈసారి సీట్‌ ఇస్తే ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. సత్తెనపల్లి సీటు ఈసారి స్థానికులకే ఇవ్వాలని సత్తెనపల్లి వైసీపీ నేతలు డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో వెన్న వెంకట రెడ్డి, వెన్న సుబ్బా రెడ్డి, వుడుముల వీరంజ నీయులరెడ్డి ఎంపీటీసి, దేవిరెడ్డి రమణ రెడ్డి మాజీ సర్పంచ్‌, యారం చిన్నపరెడ్డి, తిరుమల రెడ్డి, సత్తెనపల్లి రూరల్‌ సైయాద్‌ షిమా రజిమహద్‌, నందిగామ ఎంపీటీసి, యామపాటి విజయ కుమారి పెద్ద మక్కెన ఎంపీటీసి, వజ్రాల రోషిరెడ్డి గుడిపూడి ఎంపీటీసీ, తోరటి తిరుపత రావు గుడిపూడి సర్పంచ్‌, కొరివి అనిల్‌ కుమార్‌ కోమేర పూడి సర్పంచ్‌, అబ్బురు యార్లగడ్డ అలేఖ్య కపాకరవు ఎంపీటీసీ, సంకటి మహేంద్ర కొమరపూడి ఎంపీటీసీ, గంజి బులక్ష్మి గోగులపాడు సర్పంచ్‌, గుజ్జల పూడి సతీష్‌ కౌన్సిలర్‌ 11 వార్డు, రాప్రోల్‌ వెంకట కృష్ట రెడ్డి రుద్ర వరం సర్పంచ్‌, మధిర వెంకటేస్వరా రెడ్డి మాజీ సర్పంచ్‌, మధిర రామ కృష్ట రెడ్డి మాజీ సర్పంచ్‌, వనమాల శ్రీ లక్ష్మి బ్రాహ్మ రెడ్డి, వైస్‌ సర్పంచ్‌ చాగంటి వారి పాలెం, రహంతుళ్ళ మాజీ మండల అధ్యక్షులు ముప్పాళ్ల తదితరులు పాల్గొన్నారు.

➡️