దేవ్ పటేల్ నటిస్తూ నిర్మాతగా వ్యవహరిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం మంకీ మ్యాన్ ట్రైలర్ విడుదలయ్యింది. గత రెండేళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. దేవ్ పటేల్ స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా తనే ఇచ్చేలా ప్లాన్ చేశారు. ‘నా చిన్నతనంలో మా అమ్మ నాకు ఒక కథ చెప్పేది’ అంటూ హీరో చెప్పిన డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. హీరోయిన్గా శోభితా దూళిపాళ్ల నటిస్తున్నారు. ప్రతినాయకులుగా మకరంద్ దేశ్పాండేతోపాటు సిఖందర్ ఖేర్ కూడా కన్పించనున్నారు. యూనివర్శల్ పిక్చర్స్ బ్యానర్పై ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదల కానుంది.