ఎస్.ఎస్.ఎల్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై కంచర్ల ఉపేంద్ర హీరోగా, మీనాక్షి జైస్వాల్, ప్రణీత హీరోయిన్లుగా రెడ్డెం యాద కుమార్ దర్శకత్వంలో కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న ఈ చిత్రం ‘కంచర్ల’. టాకీ పార్ట్ పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ విషయాన్ని నిర్మాత కంచర్ల అచ్యుతరావు తెలియజేస్తూ, ‘ప్రస్తుతం పాటల చిత్రీకరణను కేరళ, గోవా, శ్రీకాకుళం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో జరుపుతున్నాం. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుపుతున్నాం. యువత రాజకీయాల్లోకి రావాలని, భూస్వాముల దగ్గర ఉన్న భూమి పేద ప్రజలకు పంచాలన్నది ఈ చిత్ర ప్రధానాంశం. దీనికి కమర్షియల్ అంశాలను మేళవించి, ప్రేక్షకులను అలరింపజేసేలా చిత్రాన్ని తెరకెక్కించాం’ అని చెప్పారు. ‘సామాజిక స్పృహతో సమాజాన్ని జాగృతం చేసే అంశాలను ఇందులో పొందుపరించిన’ట్లు దర్శకుడు రెడ్డెం యాద కుమార్ తెలిపారు.