భక్తుల రద్దీ క్రమబద్ధీకరణపై అయోధ్య ట్రస్టు ప్రతినిధులకు అవగాహన ప్రజాశక్తి- తిరుమల:భక్తుల రద్దీ క్రమబద్ధీకరణతోపాటు క్యూలైన్ల నిర్వహణ తదితర అంశాలపై అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతినిధులకు టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి నేతత్వంలోని అధికారులు అవగాహన కల్పించారు. ట్రస్టు ఆహ్వానం మేరకు టీటీడీ అధికారులు శనివారం అయోధ్యకు చేరుకున్నారు. ట్రస్టు కార్యాలయంలో ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా బాలరాముని ఆలయానికి వచ్చే భక్తులకు సంతప్తికరంగా దర్శనం కల్పించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేపట్టాలనే విషయాలను టీటీడీ ఈవోను అడిగి తెలుసుకున్నారు. క్యూలైన్ల నిర్వహణకు సంబంధించి టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు పలు సూచనలు చేశారు. అనంతరం టీటీడీ అధికారులకు స్వామివారి దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అయోధ్య ట్రస్ట్ ప్రతినిధులు డాక్టర్ అనిల్ మిశ్రా, గోపాల్జి, జగదీష్ ఆఫ్లే, గిరీష్ సహస్ర భోజని, విశ్వహిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి రాఘవులు, డిఎస్ఎన్ మూర్తి, టీటీడీ సాంకేతిక సలహాదారు జి.రామచంద్రారెడ్డి, ఎస్ఇ-2 జగదీశ్వర్ రెడ్డి, డెప్యూటీ ఈఈలు బాబు, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.