బుట్టాయగూడెంలో మెగా జాబ్‌ మేళా

ప్రజాశక్తి – బుట్టాయగూడెం
బుట్టాయగూడెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల హైస్కూల్‌ ఆవరణలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ ద్వారా సుమారు 30 ప్రముఖ కంపెనీలతో 1600 ఉద్యోగాలతో మెగా జాబ్‌మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు, (కెఆర్‌.పురం) ఐటిడిఎ పిఒ కె.సూర్యతేజ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత ఎంఎల్‌ఎ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిరోద్యగ యువత ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్కిల్‌ హబ్‌ సెంటర్‌ ద్వారా స్కిల్‌ని పెంచుకుని భవిష్యత్తుకు మంచి బాట వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కారం శాంతి, జెడ్‌పిటిసి సభ్యులు మొడియం రామతులసి, వైస్‌ ఎంపిపి గుగ్గులోతు మోహన్‌రావు, సొసైటీ అధ్యక్షులు అరేటి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు సోదేం సుధార్‌, సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, సచివాలయ కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️