ప్రజాశక్తి-అర్ధవీడు : ఆంధ్రప్రగతి గ్రామీణబ్యాంకు ఖాతాదారులు వీరభద్రాపురం గ్రామానికి చెందిన చిలకరాజు ,కందుకూరు గ్రామానికి చెందిన కష్ణారెడ్డి ఇటీవల మృతిచెందారు.మృతులు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో పి ఎంజెజె బీమా కలిగిఉన్నారు. అందులో భాగంగా చిలకరాజు సతీమణి మమత, కష్ణారెడ్డి సతీమణి మహాలక్ష్మికి బ్రాంచి మేనేజర్ బద్రీనాథ్ చేతుల మీదగా ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చెక్కులు శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో క్యాషియర్ మణికంఠ, ఫీల్డ్ ఆఫీసర్ ఆసిస్, కార్తీక్, రవి, మెసెంజర్ పాల్గొన్నారు