విజయవాడ : అధికార పార్టీ వైసీపీకి గుడ్బై చెప్పేసిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బీజేపీలో చేరారు. శనివారం బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో ఎమ్మెల్యే.. కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాపు రామచంద్రారెడ్డికి పురందేశ్వరి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రామచంద్రారెడ్డితో ఆయన సతీమణి కూడా బీజేపీలో చేరారు.
కాగా.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వని కారణంగా గత కొంత కాలంగా వైసీపీ హైకమాండ్పై కాపు రామచంద్రారెడ్డి అసంతఅప్తితో ఉన్నారు. సీఎం, వైసీపీ అధినేత జగన్ రెడ్డి వైఖరి నచ్చకపోవడంతో ఆ పార్టీకి కొన్నిరోజుల క్రితమే కాపు రాజీనామా చేశారు. ఇప్పుడు తాజాగా కాపు రామచంద్రారెడ్డి కాషాయి కండువా కప్పుకున్నారు.