– సోము, మాధవ్, వరదాపురం సూరికి మొండిచెయ్యి
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఎన్నికల్లో పోటీ చేయనున్న బిజెపి శాసనసభ అభ్యర్థుల జాబితాను బుధవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. ఎచ్చెర్ల నుంచి ఎ ఈశ్వరరావు, విశాఖపట్నం ఉత్తరం పి విష్ణుకుమార్రాజు, అరకు వ్యాలీ (ఎస్టి) పంగి రాజారావు, అనపర్తి నుంచి ఎం శివకృష్ణంరాజు, కైకలూరు నుంచి కామినేని శ్రీనివాసరావు, విజయవాడ పశ్చిమ నుంచి వైఎస్ సుజనా చౌదరి, బద్వేల్ (ఎస్సి) బజ్జా రోశన్న, జమ్మలమడుగు నుంచి సి ఆదినారాయణరెడ్డి, ఆదోని నుంచి పివి పార్ధసారథి, ధర్మవరం నుంచి సత్యకుమార్ ఉన్నారు. అనపర్తి నుంచి సోము వీర్రాజు ఉండొచ్చని, ధర్మవరం నుంచి వరదాపురం సూరి ఉండొచ్చని ప్రచారం జరిగినా ఆ పార్టీ ప్రకటించిన జాబితాల్లో వీరిద్దరికీ స్థానం దక్కలేదు.