ప్రజాశక్తి-బాపట్ల : స్నేహితుడిపై దాడిని అడ్దుకో బోయిన ఘటనలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన బాపట్ల సూర్యలంక రహదారిలో కనకాద్రి నగర్ వద్ద మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యలంక రహదారి లోని ఓ రెస్టారెంట్ వద్ద రాహుల్ అనే యువకుడిపై దాడి చేశారు. దాడిని అడ్డుబోయిన బాపట్ల పెయింటర్స్ కాలనీకి చెందిన గోరంట్ల వెంకట సుమంత్ (32) హత్యకు గురయ్యాడు. క్షతగాత్రుడు రాహుల్ చీరాల ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. హత్యకు దారి తీసిన కారణాలను సేకరిస్తున్నట్లు పట్టణ సిఐ శ్రీనివాసులు తెలిపారు.