బాధితుల చెంతకు సెల్‌ఫోన్లు

Feb 17,2024 20:36

 ప్రజాశక్తి-విజయనగరంకోట : జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న 30 మొబైల్స్‌ను పోలీసులు ట్రేస్‌ చేసి బాధితులకు అందజేశారు. విజయనగరం సోషల్‌ మీడియా సైబర్‌ సెల్‌ సిఐ టి.వి.విజయకుమార్‌ శనివారం సైబర్‌క్రైమ్‌ పోలీసు స్టేషను వద్ద వాటిని బాధితులకు అందజేశారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్ల గురించి ఫిర్యాదు చేసిన వారం రోజుల్లోనే 30 ఫోన్లను ట్రేస్‌ చేసినట్లు సిఐ తెలిపారు. పోయిన మొబైల్స్‌పై ష్ట్ర్‌్‌జూర://షషష.షవఱతీ.స్త్రశీఙ.ఱఅ ఆన్‌లైన్‌ ద్వారా, సైబర్‌ క్రైం పోలీసు స్టేషనులో నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. తక్కువ వ్యవధిలోనే తిరిగి తమకు ఫోన్లను అప్పగించిన సైబర్‌ సెల్‌ పోలీసులకు, ఎస్‌పి దీపికకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సైబర్‌ సెల్‌ ఎస్‌ఐలు ప్రశాంత కుమార్‌, నజీమా బేగం, సైబర్‌ సెల్‌ కానిస్టేబుళ్ళు వాసుదేవ్‌, శ్రీనివాసరావు, రాజేష్‌, నాగమణి, శిరీషా పాల్గొన్నారు.

➡️