హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఎక్సైజ్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 6 బస్సుల్లో తరలిస్తున్న 30 కేజీల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. గంజాయి తరలిస్తున్న 10 మందిని ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. పాడేరు, నర్సీపట్నం, విశాఖ నుంచి గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.