ప్రజాశక్తి – కడప అర్బన్ బలిజలు రాజకీయంగా ఎదగాలని ఎమ్మెల్సీ రామచంద్రయ్య పిలుపునిచ్చారు. ఆదివారం బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయంగా ఎదిగే వారికి చేయూతనివ్వాలని చెప్పారు. నాయకత్వ లక్షణాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. జనాభా ఉంటే సరిపోదని, క్రియాశీలకంగా పనిచేయాలని పేర్కొన్నారు. అధినాతన రాజకీయ పరిస్థితుల్లో నాయకత్వ లక్షణాలు ఎంతో అవసరమన్నారు. శ్రీకష్ణదేవరాయలు ఏ యుద్ధంలో ఓడిపోలేదని గుర్తు చేశారు. సంఘటితంగా ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఎదుటివాడిని మన వైపు వచ్చేలా మనకి ఉండాలని చెప్పారు. సుగవాసి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అందరూ గర్వించేలా పనిచేస్తానని తెలిపారు. బాలిశెట్టి హరిప్రసాద్ మాట్లాడుతూ వనభోజన మహోత్సవానికి పెద్ద ఎత్తున హాజరైన బలిజలకు కతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు నాగరాజు, ప్రసాద్, చెన్నం శెట్టి మురళి, చలపతి, సుబ్రహ్మణ్యం, రమణ, రామాంజనేయులు, సుంకర శ్రీనివాస్, ఆకుల చలపతి, టైలర్ ఈశ్వర్, పాలెం వంశీకృష్ణ, టిప్పర్ బాబు, అడ్వకేట్ భాగ్యశ్రీ, సంఘం నాయకులు పాల్గొన్నారు.