బయటపడిన నటి డ్రగ్స్‌ దందా..

Jan 30,2024 16:16 #Drugs, #hyderabad

హైదరాబాద్‌: నగర శివారు నార్సింగిలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ కేసులో పలు వివరాలను పోలీసులు సేకరించారు. నిందితురాలు లావణ్య (34) విజయవాడ నుంచి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌ వచ్చినట్లు గుర్తించారు. సంగీతం టీచర్‌గా పని చేస్తూ లఘు చిత్రాల్లో నటించేవారని రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. షార్ట్‌ ఫిల్స్మ్‌లో నటించే సమయంలో జల్సాలకు అలవాటుపడి డ్రగ్స్‌ దందా మొదలు పెట్టారని తెలిపారు. కోకాపేటలో నివాసముంటున్న లావణ్య కొన్నాళ్లుగా డ్రగ్స్‌ దందా చేస్తున్నట్టు మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులకు సమాచారం అందడంతో ఆదివారం సాయంత్రం శంకర్‌పల్లి-నార్సింగి రహదారిలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా ఆమె వద్ద 4 గ్రాముల ఎండీఎంఏ లభించింది. ఆమె కొన్నిరోజులుగా డ్రగ్స్‌ వినియోగిస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో పరిచయస్థుడైన ఉనీత్‌రెడ్డి ఎండీఎంఏను తన బ్యాగులో వేశాడని ఆమె చెప్పారు. అతడు గతంలో డ్రగ్స్‌ వినియోగిస్తూ మోకిల పోలీసులకు చిక్కాడు. ఆ తర్వాత విక్రేతగా మారి సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ఉనీత్‌రెడ్డితో పాటు ఇందూ అనే మరో మహిళ పరారీలో ఉన్నారు.

➡️