ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నగరంలో అన్ని రాజకీయ పార్టీలు ఫ్లెక్సీలను కార్పొరేషన్ సిబ్బంది తొలగిస్తున్నారు. శనివారం రాత్రి నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నగరంలో ఎన్నికల అధికారి అనుమతి లేనిదే ఎటువంటి రాజకీయ పార్టీలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని కమిషనర్ ఎంఎం నాయుడు తెలిపారు. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని చెప్పారు. నగరంలో ఉన్న విగ్రహాలకు ముసుగు కప్పి ఉంచనున్నట్లు తెలిపారు.