ప్రయివేటు ఆసుపత్రుల సేవలు అభినందనీయం

Dec 23,2023 23:21
గ్రామాల్లోని ప్రజలకు

ప్రజాశక్తి – గండేపల్లి

గ్రామాల్లోని ప్రజలకు ప్రయివేటు ఆసుపత్రి యాజమాన్యాలు స్వచ్ఛంధంగా వైద్య సేవలు అందించడం అభినందనీయమని మాజీ ఎంఎల్‌ఎ జ్యోతుల నెహ్రూ అన్నారు. మండలంలోని సూరంపాలెం గ్రామంలో గ్రామ ఉపసర్పంచ్‌, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి సూరంపాలెం బాలు, నయన శ్రీల ఆధ్వర్యంలో సూరంపాలెం ఏర్పాటుచేసిన ఉచిత మెగా వైద్యశిబిరాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. నిర్వాహకులు బాలు మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ, జ్యోతున్‌ నవీన్‌ ఆశీస్సులతో రాజానగరం జిఎస్‌ఎల్‌ జనరల్‌ హాస్పటల్‌, కాకినాడ విజన్‌ ఐ కేర్‌ హాస్పిటల్స్‌ సంయుక్తంగా ఉచిత మెగా మెడికల్‌ క్యాంప్‌ను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా బిపి, షుగర్‌, ఇసిజి, స్కానింగ్‌, క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌విఎస్‌.అప్పలరాజు, పి.మోహనరావు, కె.రామకృష్ణ, పి.బాబురావు పాల్గొన్నారు.

➡️