ప్రత్యేక పూజలు

Apr 6,2024 22:01
ఫొటో : మాట్లాడుతున్న కాకర్ల సురేష్‌

ఫొటో : మాట్లాడుతున్న కాకర్ల సురేష్‌
ప్రత్యేక పూజలు
ప్రజాశక్తి-కలిగిరి : కలిగిరి మండలం రావులకొల్లు సర్పంచ్‌ వెంగపనాయుడు ఆధ్వర్యంలో ఉమ్మడి ఎంఎల్‌ఎ అభ్యర్థి కాకర్ల సురేష్‌ గ్రామదేవత సీతాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడికి వచ్చిన గ్రామ నాయకులు ప్రజలతో మాట్లాడుతూ ఓటు అనే ఆయుధంతో తెలుగుదేశాన్ని గెలిపించాలని, తెలుగుదేశం గెలిస్తే మీరు తాను గెలిచినట్టే అన్నారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్రానికి భవిష్యత్తు అని తెలిపారు. అదేవిధంగా యువతకు ఉద్యోగాలు కావాలంటే బాబు రావాలన్నారు. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రం అధోగతి పాలైందని, రాజధాని లేని రాష్ట్రంగా అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా తయారైందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ గాడిలో పడాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఓటు ద్వారా విజయం సాధిద్దామని తెలిపారు. అదేవిధంగా ఎంపి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలన్నారు. ఉదయగిరిని అన్ని విధాలుగా తీర్చిదిద్దుతానని ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో కలిగిరి మండల కన్వీనర్‌ బిజ్జం వెంకట కృష్ణారెడ్డి, కాకర్ల సునీల్‌, కాకర్ల వెంకట్‌, నియోజకవర్గ, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు అభిమానులు ఉన్నారు.

➡️