పల్నాడు జిల్లా: ప్రజాశక్తి ప్రచురించిన నూతన సంవత్సర నరసరావుపేట కేలండర్ ను కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేం ద్రంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య, సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరు కుమార్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.రాధాకృష్ణ ,అనుముల లక్ష్మీశ్వర రెడ్డి, ఏపూరి గోపాలరావు, జి.రవిబాబు,ఎస్. ఆంజనేయ నాయక్, జిల్లా కమిటీ సభ్యులు డి.శివకుమారి,సిపిఎం రొంపిచర్ల మండల కార్యదర్శి కామినేని రామారావు తదితరులు ఆవి ష్కరించారు. గాంధీ పార్క్ వద్దగల ధర్నా చౌక్ అంగన్వాడీల సమ్మె శిబిరంలో యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కెపి.మెటిల్డా దేవి, గుంటూరు మల్లేశ్వరి, సిఐటియు మండల అధ్యక్షులు మసూద్ లు ఆవిష్కరించారు. పట్టణంలోని ప్రకాష్ నగర్ 60 అడుగుల రోడ్డులో వైసిపి కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , గుంటూరు రోడ్డులోని టిడిపి కార్యాలయంలో డాక్టర్ చదలవాడ అరవింద బాబు, జిల్లా టిడిపి కార్యాలయంలో టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు జివి ఆంజనేయులు, సెల్ ఉపాధ్యక్షులు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి నలపాటి రామచంద్ర ప్రసాద్ ,తదితరులు ప్రజాశక్తి క్యాలెండర్ ఆవిష్కరించారు. కార్మిక ,కర్షక, పీడిత వర్గాల గొంతుకగా ప్రజాశక్తి ముఖ్యం ప్రజల పక్షాన పని చేస్తుందని కొనియాడారు.ఆయా కార్య క్రమాలలో ప్రజాశక్తి పల్నాడు జిల్లా సిబ్బంది పాల్గొన్నారు.