ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వీడాలి : కదిరి

ప్రజాశక్తి – కనిగిరి : ప్రజా సమస్యలు పట్ల పాలకులు నిర్లక్ష్యం వీడాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కదిరి భవాని డిమాండ్‌ చేశారు. కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని టకార పాలెం, మంగళ మాన్యంలో సోమవారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పూరి గుడిసెలకు కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నట్లు తెలిపారు. ఉన్నతాధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పేదలకు సరైన వసతులు కల్పించాలని కోరారు. మున్సిపల్‌ చైర్మన్‌ వెంటనే స్పందించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

➡️