ప్రజాశక్తి-యర్రగొండపాలెం: మండలంలోని మండల మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక సమావేశం మండల సమాఖ్య అధ్యక్షురాలు కొర్రపోలు జ్యోతి అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ క్రాంతి పథం ఏరియా కో-ఆర్డినేటర్ కుందురు లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం వలన భూమి సార వంతం అవుతుందన్నారు. నీటి పొదుపు, నీరు కలుషితం కాకుండా ఉండడం, తద్వారా పండిన పంటలతో ప్రజలు ఆరోగ్యంగా ఉండడం వంటివి సాధ్యమవు తాయని తెలిపారు. అందరు సభ్యులు పురుగు మందులు లేకుండా కషాయా లతో వ్యవసాయం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏపిసిఎన్ఎఫ్ మద్దయ్య, ఏపిఎం ఎడ్వర్డ్, ఎల్సి మూల వెంకిరెడ్డి, సిసిలు నాగయ్య, ఇబ్రహీం, జ్యోతి, అకౌంటెంట్ మాధవి, విఓఈసీ సభ్యులు, విఓఏలు పాల్గొన్నారు.