దర్శి : తండ్రి మద్యం తాగి వచ్చి నానా ఇబ్బందులు పెడుతున్నారని ఓ కుమారుడి ఆవేశం కట్టతెచ్చుకుంది. మద్యం తాగొద్దని తండ్రికి, తన తండ్రికి మద్యం అమ్మొద్దని వైన్ షాపు యజమానికి ఎన్నో సార్లు చెప్పి చూశారు. అయినా సరే ఇద్దరూ వినలేదు. దీంతో వైన్ షాపునే తగలబెట్టాలనుకున్నారు. పెట్రోల్ కొని ప్యాకెట్లో పోసి వైన్ షాపుపై దాడి చేసి నిప్పంటించారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా దర్శిలో జరిగింది. దర్శికి చెందిన వంశీకఅష్ణ తన తండ్రి నిత్యం మద్యం తాగి వచ్చి కుటుంబ సభ్యులను ఇబ్బందులు పెట్టడాన్ని తట్టుకోలేకపోయారు. ఇంటికి సమీపంలోని వైన్షాపు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి ఇలా మారడానికి దగ్గర్లో వైన్ షాపు ఉండటమేనని భావించారు. దీంతో ఆ వైన్ షాపుపై పెట్రోల్ ప్యాకెట్తో దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన వైన్ షాప్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ దాడిలో వైన్ షాపులోని సామాగ్రి కాలిపోయింది. అయితే పెట్రోల్ దాడికి పాల్పడిన యువకుడు వంశీకఅష్ణపై వైన్ షాపు సిబ్బంది దాడి చేసి పోలీసులకు అప్పగించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.