పోలీస్ స్టేషన్‌కు స్టాపర్స్ బోర్డులు

Mar 4,2024 00:11

ప్రజాశక్తి – వేటపాలెం
చీరాల నటరాజ్ జువెలరీ అధినేత కొత్తమాసు కుమార్ వేటపాలెం పోలీస్ స్టేషన్‌కు నాలుగు స్టాపర్ బోర్డులను ఆదివారం బహూకరించారు. ఎస్ఐ జి సురేష్‌కు జ్యువెలరీ సిబ్బంది అందజేశారు. 216 జాతీయ రహదారిపై స్టాపర్స్ బోర్డులను ఏర్పాటు చేయనున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కూడా నటరాజ్ జ్యువెలరీ ఇచ్చారని, ఇప్పుడు మరో నాలుగు బోర్డులు ఇచ్చారని తెలిపారు. దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎఎస్ఐ శ్యామ్ పాల్గొన్నారు.

➡️