గుంటూరు జిల్లా ప్రతినిధి: జిల్లా ఎస్పి తుషార్ దూడి శనివారం జిల్లా పోలీసు కార్యా లయంలో వున్న వివిధ విభాగాలకు చెందిన ప్రాంతలలో ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లా కార్యాలయంలో వున్న రూరల్ జిల్లా పోలీసు కార్యాలయం, చిల్డ్రన్ రీడింగ్ రూం,ఎఆర్ డ్యూటీ ఆఫీసర్ రూం, కమ్యునికేషన్ ప్రాంతం, వివిధ విభాగాలను పరిశీలించారు. అత్యవసర సమయంలో ఉపయోగించే పరికరాలకు సంబంధించిన పోలీస్ గుడారాలను నిల్వ ఉంచే ప్రాంతాలను పరిశీలించారు. డిఎస్పి శ్రీనివాసరావు, ఆర్ఐలు థామస్ రెడ్డి, రమేష్కృష్ణన్, స్పెషల్ బ్రాంచ్ సిఐ వెంకటరావు పాల్గొన్నారు.