నిల్వప్రజాశక్తి – సింహాద్రిపురం మండలంలోని పైడిపాలెం రిజర్వాయర్లో 4.45 టిఎంసిల నీరు నిల్వ ఉన్నాయని గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ డిఇ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు సామర్థ్యం 6 టిఎంసిలు కాగా ఇప్పటివరకు రైతుల అవసరాల దష్ట్యా హిమకుంట్ల , మల్లెల కాలువల ద్వారా నీటిని విడుదల చేశామన్నారు. ప్రస్తుతం100 క్యూసెక్కుల నీరు మల్లెల కాలువ ద్వారా చెరువులకు నింపేందుకు విడుదల చేశామని తెలిపారు. రైతుల అవసరాల దష్ట్యా హిమకుంట్ల కాల్వకు, మల్లెల కాల్వకు అదనంగా నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.