పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Dec 25,2023 21:38

తమ గురువులతో పూర్వ విద్యార్థులు

                హిందూపురం : పట్టణంలోని ఎంజిఎం మున్సిపల్‌ హై స్కూల్‌లో 1977, 1978, 1979వ సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం ఘనంగా జరిగింది. తొలత పాఠశాల ఆవరణంలో ఉన్నా గాంధీó విగ్రమానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పూర్వ విద్యార్థులు దాదాపు 45 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో వారు ఎంతో ఆనందంగా కన్పించారు. నాడు పాఠశాలలో గడిపిన మధుర స్కృతులను, గుర్తుకు తెచ్చుకుని సంతోషంగా గడిపారు. ఇక్కడ చదవిన విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి దేశ, విదేశాల్లో అత్యున్నత స్థానాల్లో స్థిరపడ్డారు. నాడు తమకు విద్యాబుద్దులు నేర్పిన గురువులు సుబ్రహ్మణ్యం, కగ్గల్లు అంజినప్ప, నారాయణ శెట్టిలను ఈసందర్బంగా వారు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా గురువులు మాట్లాడుతు 45 సంవత్సరాల తరువాత తమను పిలించి ఇంతటి తీపి జ్ఞాపకాలను తిరిగి ఆస్వాదించేలా చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత స్థానంలో ఉండడం చాలా సంతోషంగా ఉందనారు. పూర్వ విద్యార్థులు మాట్లాడుతు ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 25న అందరు కలిసే విధంగా నిర్ణయించుకున్నారు.

➡️