పుస్తకాలు పంపిణీ

ప్రజాశక్తి – వేపాడస్థానిక శాఖా గ్రంథాలయానికి టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ పుస్తకాలను గురువారం వితరణగా అందించారు. యువతకు ఉపయోగపడే గ్రూప్‌-1, గ్రూప్‌-2 (1 సెట్‌)’ కానిస్టేబుల్‌ (1 సెట్‌)’ డిఎస్‌సి (1 సెట్‌) పోటీ పరీక్షలో ఉపయోగపడే రూ. 15వేలు విలువ చేసే 20 పుస్తకాలను అందించారు. అనంతరం గొంప కృష్ణ మాట్లా డుతూ విద్యార్థుల కష్టపడి చదివితే తప్ప ఈ రోజుల్లో యువత కు ఉపాధి కలగడం కష్టమన్నారు. మీరంతా ఈ బుక్స్‌ చదివి మంచి ప్రయోజకులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతు న్నామన్నారు. గ్రంథాలయానికి వచ్చే యువతకు పోటీ పరీక్షల్లో ఉపయోగపడే బుక్స్‌ ఇచ్చినందుకు గ్రంథాలయ అధికారి సోమనాయుడు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ కోట టిడిపి మహిళా అధ్యక్షులు గుమ్మడి భారతి, బానాది ఎంపిటిసి గొంప తులసి, మండల తెలుగు యువత అధ్యక్షుడు ముక్క రామకృష్ణ, మండల ఐటిడిపి అధ్యక్షుడు సేనాపతి గణేష్‌, మండల తెలుగు యువత అధ్యక్షుడు సిరికి రమణ, నాయకులు గొర్రె నాగరాజు, మంచిని అప్పలసూరి, గొర్రుపోటు వెంకటరమణ పాల్గొన్నారు. బాబా కార్యక్రమాలకు హాజరుమండలంలో బానాది, బల్లంకి గ్రామాలలో నిర్వహించిన సత్య సాయి బాబా కార్యక్రమాలలో రాష్ట్ర టిడిపి కార్యదర్శి గొంప కృష్ణ పాల్గొని ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు గొంప వెంకటరావు, టిడిపి పార్టీ సీనియర్‌ నాయకులు నాగరాజు, అప్పల సూరి, శిరికి రమణ, టి. కృష్ణ పాల్గొన్నారు.

➡️