ప్రజాశక్తి – యానాంపుదుచ్చేరి సోలైనగర్లో బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని యానాం యువత, సిఐటియు, జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్ పాత బస్టాండ్ వద్ద నిరసన తెలియజేశారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కెవివి.సత్యనారాయణ, సిఐటియు జిల్లా కార్యదర్శి జి.దుర్గాప్రసాద్, దయ, మన్నే కిరణ్ తదితరులు మాట్లాడారు. మహిళలపై అత్యాచారాలను నివారించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని విమర్శించారు. మద్యం, గంజాయి వంటి మాదకద్రవ్యాలు ఏరులై పారుతున్నాయన్నారు. ఇటువంటి సంఘటన మళ్లీ జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రధాన రహదారుల్లో సిసి కెమేరాలు ఏర్పాటు చేయాలని, బాలిక కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్నాని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లాడి వెంకట్, లంక వినరు కొప్పిశెట్టి వాసు, సిఐటియు కన్వీనర్ సత్యనారాయణ, ఇళ్ల శ్రీనివాస్, జి.నాగేశ్వరావు, మహేష్, రమేష్, దిలీప్ పాల్గొన్నారు.