పిడుగు పడి 35 గొర్రెలు మృతి

Mar 20,2024 21:14

 ప్రజాశక్తి- తెర్లాం : మండలంలోని వి.చిన్నయ్యపేట గ్రామంలో పిడుగు పడి 35 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల కాపరి వెన్నెల రాము బుధవారం ఉదయం గొర్రెలను మేపునకు తీసుకొని పొలంలోకి వెళ్లాడు. గొర్రెలు మేత మేస్తుండగా, ఒక్కసారిగా పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. దూరం నుంచి చూస్తుండగానే పిడుగు పడి మృతి చెందాయని రాము ఆవేదన చెందారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.

➡️