పామర్రులో అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ

అంబేద్కర్‌

ప్రజాశక్తి-రామచంద్రపురంకె.గంగవరం మండలంలోని పామర్రు హైస్కూల్లో ప్రముఖ వైద్యులు డాక్టర్‌ కాదా వెంకట రమణ ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కాంస్య విగ్రహాన్ని బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవం రోజున అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్‌ వెంకటరమణ ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు, వైద్యులు డాక్టర్‌ బాబ్జి, జెడ్‌పిటిసి ఓబులనేని వరలక్ష్మి, ఎంపిపి పంపన నాగమణి, వైసిపి నాయకులు రేవు శ్రీను, పెట్టా శ్రీను, బత్తుల అప్పారావు, తోకల శ్రీనివాస్‌, వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్‌ ఇళ్ల సూర్యనారాయణ, గ్రామ సర్పంచ్‌ వాసంశెట్టి వెంకటలక్ష్మి సూరిబాబు, టిడిపి నాయకులు గరికిపాటి సూర్యనారాయణ, కొమరిన వీర్రాజు పాల్గొన్నారు.

➡️