పాఠశాలల అభివృద్ధికి కృషి: బూచేపల్లి

ప్రజాశక్తి-తాళ్లూరు: మండలంలోని బొద్దికూరపాడు గ్రామంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల తన స్వగ్రామం అయినందున పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నట్లు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా పరిషత్‌ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఆల్‌ ఇన్‌ వన్‌ స్టడీ మెటీరియల్స్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకాయమ్మ, శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి విద్యార్ధుల కోసం ఎంతో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్‌ ప్రసాద్‌రెడ్డి, నాగంబొట్లపాలెం సర్పంచ్‌ సుబ్బారావు, నాయకులు అంజిరెడ్డి, రామిరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

➡️