పన్ను బకాయి దారులను ఉపేక్షించొద్దు

Mar 19,2024 21:52

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : దీర్ఘకాల కుళాయి పన్ను దారులను ఉపేక్షించవద్దని సిబ్బందికి, కార్యదర్శులకు నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎం.మల్లయ్య నాయుడు చెప్పారు. మంగళవారం సచివాలయాల వారీగా నగరపాలక సంస్థ కార్యాలయం నందు సమీక్ష నిర్వహించారు. అనేకచోట్ల కుళాయి పన్నులు బకాయిలు పడ్డాయని, ఈ విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించకూడదని చెప్పారు. ఎప్పటికప్పుడు పన్ను వసూళ్లను చేపడుతూ ఉండాలన్నారు. దీర్ఘకాల కుళాయి పన్నుదారుల కనెక్షన్లను తొలగించి వేయాలని ఆదేశించారు. పన్నులను త్వరితగతిన వసూలు చేసి నీటి నిర్వహణకు తోడ్పాటునందించాలని చెప్పారు. సమావేశంలో సహాయ కమిషనర్‌ తిరుమలరావు, ఇన్చార్జి ఇఇ దక్షిణామూర్తి, కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️