ఫొటో : ప్రారంభిస్తున్న రాజ్యసభ సభ్యులు బిఎంఆర్, ఎంఎల్ఎ రామిరెడ్డి
నృత్య శిక్షణా తరగతులు ప్రారంభం
ప్రజాశక్తి-కావలి : కావలి తుపాన్ నగర్, శివాలయం వీధిలో సంయుక్త సేవాసంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గంగపట్నం సురేంద్ర కుమార్తె నాట్యమయూరి కుమారి జి.లిఖిత ఆధ్వర్యంలో పునప్రారంభించే నృత్య కళానిలయంలో శిక్షణ తరగతులను రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీద మస్తాన్ రావు, ఎంఎల్ఎ రామిరెడ్డి ప్రతాప్కుమార్ రెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బిఎంఆర్ మాట్లాడుతూ నృత్య కళానిలయం నృత్య శిక్షణ నిర్వాహకులు కుమారి జి.లిఖిత ఎక్కువమంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలంటే శాశ్వత భవనం నిర్మించేందుకు ఎంపి నిధుల నుండి ఆర్థికసాయం మంజూరు చేయంచడానికి ప్రయత్నం చేస్తానని హామీనిచ్చారు. ఎంఎల్ఎ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కావలిలో నృత్య కళా భవనం నిర్మించడానికి నివేశన స్థలం మంజూరు చేయించడానాకిఇ తన వంతు సహకారం అందిస్తానని, కరతాళ ధ్వనుల మధ్య భరోసానిచ్చారు. కుమారి లిఖిత మాట్లాడుతూ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన శ్రేయోభిలాషులు, రాజ్యసభ సభ్యులు, బీద మస్తాన్ రావు, ఎంఎల్ఎ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలకు హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో బిఎంఆర్, ఆర్.పి.ఆర్. ప్రేమాభిమానులు, సంయుక్త సేవాసంస్థ సభ్యులు డాక్టర్.సతీష్, బి.రఘుకుమార్ రెడ్డి, గ్రంధం ప్రసన్నాంజనేయులు, పి.జానకిరామ్, జి కళ్యాణి, ఎం అజిత్ బాబు, ఎంవి ప్రసాద్ రావు, ఖాదర్ బాషా, ఎన్.శివ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.