నిర్మాణ పనులు పూర్తి చేయాలి

Dec 16,2023 22:32
మాట్లాడుతున్న తాజుద్దీన్‌

మాట్లాడుతున్న తాజుద్దీన్‌
నిర్మాణ పనులు పూర్తి చేయాలి
ప్రజాశక్తి-ఉదయగిరి:గండిపాళెం పాఠశాల తరగతి గదులు మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేయాలని జెడ్‌పి కోఆప్టెడ్‌ షేక్‌ గాజుల తాజుద్దీన్‌ జిల్లా సర్వసభ్య సమావేశంలో గళం విప్పారు. శనివారం నెల్లూరు జెడ్‌పి చైర్మన్‌ ఆనం అరుణమ్మ అధ్యక్షత జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండల పరిధిలోని గండిపాళెం ప్రాథమిక పాఠశాల తరగతి గదులు కూలడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు బడికి పంపడానికి భయపడుతున్న విషయాన్ని సభ దష్టికి తెచ్చారు. జిల్లా విద్యాశాఖాధికారి గండిపాళెం ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసు కోలేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం, మంత్రి చర్యలు తీసుకొని తరగతి గదులు మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి తరగతి గదులు మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేయాలని జిల్లా విధ్య శాఖాధికారులను ఆదేశిం చారు.ఈ సందర్భంగా తాజుద్దీన్‌ ప్రభుత్వానికి, మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

➡️