ప్రజాశక్తి-పుల్లలచెరువు : యర్రగొండపాలెం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని వైసిపి నియోజకవర్గ ఇన్ఛార్జి తాటిపర్తి చంద్రశేఖర్ తెలిపారు. పుల్లల చెరువులో వైసిపి కార్యకర్తల విస్తతస్థాయి సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యర్రగొండపాలెం నియోజక వర్గంలో రోడ్లు , నీటి వనరులు, టీ 5 కాలువ గురించి అగ్ర నాయకుల దష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసుకుందామని హామీ ఇచ్చారు. అనంతరం పులలచెరువులో దివంగత నాయకులు కంచర్ల వీరయ్య, కొర్లకుంట సత్యనారాయణ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్రామ్, డాక్టర్ వైయస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి మాజీ చైర్మన్ ఉడుముల శ్రీనివాసరెడ్డి, ఎంపిపి కందుల వెంకటయ్య, జడ్పిటిసి వాగ్యా నాయక్, మాజీ ఎంపిపి మోర్తల సుబ్బారెడ్డి, వైసిపి మండల కన్వీనర్ బివి. సుబ్బారెడ్డి, సర్పంచులు, సచివాలయ కన్వీనర్లు పాల్గొన్నారు.