మాట్లాడుతున్న గంజాం రాఘవేంద్ర
నిజం మాట్లాడని సిఎం
ప్రజాశక్తి-నెల్లూరు సిటీ:అబద్దం తప్ప నిజం మాట్లాడలేని ముఖ్యమంత్రి ఉండటం మన రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధికార ప్రతినిధి గంజాం రాఘవేంద్ర పేర్కొన్నారు. నెల్లూరు టిడిపి కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వస్తే రూ.3వేలు పెన్షన్ ఇస్తాని నమ్మించి వంచించిన జగన్ రెడ్డి పెన్షన్ల గురించి నిజాలు చెప్పే ధైర్యం ఉందానన్నారు. రూ.3 వేల పెన్షన్ పై మాట మార్చి ఒక్కొక్కరికి రూ.30వేలు ఎగనామం పెట్టారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.200 ఉన్న పెన్షన్ 2019 నాటికి రూ.2000 చేశారనీ, ఐదేళ్లలో రూ.1800 పెంచిపెన్షన్ లబ్దిదారుల సంఖ్య 34 లక్షల నుండి 54.25 లక్షలకు అందించారన్నారు. జగన్ రెడ్డి ఇప్పటి వరకు పెంచింది రూ.750 మాత్రమే అందించి ఉద్దరించానని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. చంద్రబాబు ఐదేళ్లలో రూ.7లక్షల కోట్ల బడ్జెట్ మాత్రమే ఉన్నప్పటికీ 20 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చి, పెన్షన్ మొత్తాన్ని కూడా రూ.1800 వరకు పెంచారన్నారు. జగన్ మోహన్ రెడ్డి రద్దు చేయడం తప్ప కొత్తగా ఎంచేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.