నిందితులు అరెస్టు

Jan 8,2024 19:18
వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు
నిందితులు అరెస్టు
కలువాయి : మండలం కుల్లూరులో ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ వివరాలను రాపూరు సిఐ సుబ్ర హ్మణ్యం కలువాయిలో విలేకర్ల సమావేశం నిర్వహించి వెల్లడించారు. కుల్లూరులో ఎస్‌ సి కాలనీలో నివాసముంటున్న పెంచలయ్య ఇంట్లో చోరీ జరిగింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.ఎస్‌ఐ అయ్యప్ప నేతృత్వంలో సిబ్బంది దర్యాప్తు ప్రారంభించి నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 10 సవర్ల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వారిని ఆత్మకూరు కోర్టులో హాజరుపరిచారు.

➡️