నారాయణ నర్సింగ్‌ హోం ప్రారంభం

శింగరాయకొండ : శింగరాయకొండలో నూతనంగా ఏర్పాటు చేసిన నారాయణ నర్సింగ్‌ హోంను ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి శుక్రవారం ప్రారంభించారు. శింగరాయకొండ లోని పాకల రోడ్డు వద్ద డాక్టర్‌ పులివర్తి తులసీరామ్‌ , డాక్టర్‌ మన్నం ఆశాలత ఆధ్వర్యంలో నారాయణ నర్సింగ్‌ హోంను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట మాట్లాడుతూ ఆసుపత్రి అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగ పడేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్‌ కంచర్ల శ్రీకాంత్‌, కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహేందర్‌ రెడ్డి, టిడిపి సీనియర్‌ నాయకులు దామచర్ల పూర్ణచంద్రరావు, ఒంగోలు డెయిరీ మాజీ చైర్మన్‌ చల్లా శ్రీనివాసరావు, టిడిపి కందుకూరు నియోజక వర్గ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు, అయినా బత్తిన ఘనశ్యాం, బెల్లం సత్యనారాయణ, యన్నాబత్తిన మురళి, షేక్‌ నసీర్‌, దొడ్డ మహీధర్‌రెడ్డి, చీమకుర్తి కృస్ణ, మించాల బ్రహ్మయ్య, వేల్పుల సింగయ్య, బ్రహ్మేశ్వరరావు పాల్గొన్నారు.

➡️