ఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు నష్టాల్లోనే కొనసాగాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు కీలక వడ్డీ రేట్లు తగ్గింపుపై నీలిమేఘాలు కమ్ముకునేలా చేశాయి. ఈ క్రమంలో ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. మన మార్కెట్లు కూడా అదే బాటలో నడిచాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 453 పాయింట్లు నష్టపోయి 72,643కి పడిపోయింది. నిఫ్టీ 123 పాయింట్లు కోల్పోయి 22,023 వద్ద స్థిరపడింది.