తెలంగాణ : టాలీవుడ్ నటుడు తొట్టెంపూడి వేణు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి ప్రొఫెసర్ వెంకట సుబ్బారావు (92) సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈయన కొద్దిరోజులుగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిసింది. మొన్నటి వరకు ఆయనకు వైద్యులు చికిత్సను అందించారు. ఈ క్రమంలోనే మరోసారి ఆయన ఆరోగ్యం క్షిణించగా ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు ఓ ప్రకటనను కూడా విడుదల చేశారు. ఈ విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.