హైదరాబాద్ : మలక్పేట లోని అక్బర్బాగ్లో గల నగల దుకాణంలో భారీ దోపిడీ జరిగింది. షాప్లోకి చొరబడిన ముగ్గురు దుండగులు దుకాణం యజమానిని కత్తితో బెదరించి బంగారంనగలు ఎత్తుకెళ్లారు. సంఘటనా స్థలాన్ని తూర్పు మండలం డీసీపీ జానకి ధరావత్ పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.