ప్రజాశక్తి-వీరఘట్టం(మన్యం) : మండలంలోని పనస నందివాడ గ్రామంలో మాజీ సర్పంచ్ కే.సన్యాసినాయుడు ఆధ్వర్యంలో శనివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 25 మంది రక్తాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారికి పాలకొండ ప్రాంతీయ ఆసుపత్రి సూపర్డెంట్ కే.రవీంద్ర కుమార్ సర్టిఫికెట్లు అందజేసి అభినదించారు.